కేంద్రమంత్రి బండి సంజయ్ కి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. మీరు జాతీయ హోదా ఇచ్చిన పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ కూలిపోతే బీజేపీ ఇజ్జత్ పోలేదా బండి సంజయ్ ? అని మండిపడ్డారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..చేశారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చి ఉంటే ఇజ్జత్ పోయేదని బాంబు పేల్చారు. తెలంగాణ పరువు మంట కలిసేదని పేర్కొన్నారు.

కూలిపోయిన ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సిగ్గు లేకుండా అడుగుతున్నారన్నారు. అయితే ఈ తరుణంలోనే కేంద్రమంత్రి బండి సంజయ్ కి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడ కూడా అవినీతి జరగలేదని మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి స్పష్టం చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్కు అడిగిన ప్రశ్నకు గాను కేంద్రమే ఈ సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు మాజీ మంత్రి గంగులా కమలాకర్.