గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత.. గొర్రెలతోనే రంగంలోకి

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. గాంధీభవన్ వద్ద… గొల్ల కురుమలు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో గొల్ల కురుమలకు.. అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్ వద్ద గొర్రెలతో ఆందోళనకు దిగారు గొల్ల కురుమ సంఘాల సభ్యులు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ గాంధీభవన్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

gandhi bhavan
gandhi bhavan

అయితే వాళ్ళను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా….ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో బీర్ల ఐలయ్య ఒక్కడే గొల్ల కురుమ కులాలకు సంబంధించిన ఎమ్మెల్యే. ఈయన ఒక్కరే అధికార పార్టీలో ఉన్నారు. దీంతో అతనికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తాజాగా గాంధీభవన్ వద్ద రచ్చ చేశారు గొల్ల కురుమలు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా ఇటీవల ముగ్గురు దళితులకు మంత్రి పదవులు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో మరో ముగ్గురికి అవకాశం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news