కరెంట్ బిల్ కట్టొద్దని కేటీఆర్ ఎలా చెప్తాడు…అది విధ్వంసకర ఆలోచన – భట్టి

-

కరెంట్ బిల్ కట్టొద్దని కేటీఆర్ ఎలా చెప్తాడని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్‌ అయ్యారు. జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి KTR. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు.

bhatti comments on power bills

100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం కానీ వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీలను అమలు చేసే అంశం పైన దృష్టి పెట్టు రేవంత్ రెడ్డి అని చురకలు అంటించారు కేటీఆర్. అయితే.. నిన్న కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కౌంటర్‌ ఇచ్చారు. కేటీఆర్ కరెంట్ బిల్ కట్టొద్దని అలా ఎలా చెప్తాడు. విధ్వంసకర ఆలోచన ఉండేవాళ్లు మాత్రమే ఇలా చెప్తారని మండిపడ్డారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Latest news