కేసీఆర్‌ పాలనపై భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్ సంచలన కామెంట్స్..

-

కేసీఆర్‌ పాలనపై భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. భీమవరంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఆనవాయితీగా ఉందని తెలిపారు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కెసిఆర్ జిల్లాలు విడతీసి పరిపాలన చేశారని కొనియాడారు. కానీ చంద్రబాబుకు కనీసం ఎలాంటి ఆలోచనా లేకుండా అమరావతి పేరుతో గ్రాఫిక్స్ తో ప్రజలను మోసం చేశారని ఫైర్‌ అయ్యారు.

Bhimavaram MLA Grandhi Srinivas sensational comments on KCR

జగనన్న కుటుంబానికి మా కుటుంబం ఎప్పుడు ఋణపడి ఉంటుందన్నారు. 2019 ఎన్నిక ముందు పోటీ చేయకూడదు అని ఆలోచిస్తున్న సమయంలో ఓడిన, గెలిచిన ముందుకే వెళ్ళాలి, లేదంటే మరుగున పడతాం అని అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఉపదేశం చేసినట్టు చేశారని వెల్లడించారు. ఒక పార్టీ అధ్యక్షుడి పై గెలిచినపుడు గొప్పగా అనిపించింది.. ఇపుడు చూస్తుంటే చాలా మామూలు వ్యక్తి పై గెలిచినట్టు ఉంది..పార్టీ పెట్టినప్పుడు చేగువేరా, తో పాటు మహనీయుల ఫోటో పెట్టుకున్న పవన్ ఇపుడు అవి తీసేసి.. చంద్ర బాబు ఫోటో పెట్టుకున్నారని చురకలు అంటించారు. చంద్ర బాబు లో పవన్ కి చేగువేరా కనిపిస్తున్నాడు.. యువత పవన్ ఏం చేస్తున్నాడో ఆలోచించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news