బైక్‌ను ఢీకొట్టిన వాహనం.. ఫ్లైఓవర్‌ పైనుంచి పడి వ్యక్తి మృతి

-

హైదరాబాద్ మహానగరంలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని రాయదుర్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై జరిగిన ఈ ఘటనలో రాయదుర్గం వాసి సుబ్బారావు (38) మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నుంచి రాయదుర్గం వాసి సుబ్బారావు బైక్ పై వెళ్తున్నారు. అయితే ఆయన వెనక వచ్చిన ఓ వాహనం బైక్ ను బలంగా ఢీ కొట్టడంతో ఆయన ఫ్లైఓవర్ పైనుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు బైక్‌పై అల్పాహారం విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్ ను ఢీకొట్టిన వాహనాన్ని గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఆ మార్గంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version