Bitter news for chicken lovers: చికెన్ ప్రియులకు చేదు వార్త ఎదురయింది. రెండు తెలుగు రాష్ట్రాలలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత వారంతో పోలిస్తే ఈ వారంలో చికెన్ ధరలు 20 నుంచి 30 రూపాయల వరకు పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖపట్నం నగరాలలో కేజీ చికెన్ ధర రూ. 260 నుంచి 280 వరకు విక్రయాలు జరుపుతున్నారు. కొన్ని ప్రాంతాలలో చికెన్ డిమాండ్ ను బట్టి ఇంతకన్నా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. గత వారం రోజుల నుంచి మళ్లీ కోవిడ్ వ్యాప్తి చెందుతోంది.

ఈ నేపథ్యంలో ప్రజలు ప్రోటీన్ ఫుడ్ కోసం జనాలు చికెన్ తినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని చికెన్ దుకాణా దారులు చికెన్ రేట్లను, కోడిగుడ్ల రేట్లను విపరీతంగా పెంచారు. కోవిడ్ నుంచి బయటపడడానికి చాలామంది చికెన్, గుడ్లు అధికంగా తింటారు. దీంతో చికెన్ కొనుగోలు చేసేవారు కాస్త ఆలోచనలో పడుతున్నారు.