Hyd: వైద్యుల నిర్లక్ష్యం.. మహిళ, నవజాత శిశువు మృతి

-

వైద్యుల నిర్లక్ష్యంతో.. మహిళ, నవజాత శిశువు మృతి చెందారు. హైదరాబాద్ మహా నగరంలో బాలానగర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో నిన్న ప్రసవానికి వచ్చిన అరుణ(22) అనే మహిళ, నవజాత శిశువు మృతి చెందారు. వైద్యురాలు అందుబాటులో లేకపోవటంతో డెలివరీ చేశారు నర్సులు, ఏఎన్ఎం సిబ్బంది.

Doctor's negligence leads to death of woman and newborn baby
Doctor’s negligence leads to death of woman and newborn baby

డెలివరీ అనంతరం శిశువు స్పందించటం లేదని, నిలోఫర్ ఆసుపత్రికి తరలించమని ఆసుపత్రి సిబ్బంది సూచన.. నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే శిశువు మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు. డెలివరీ అనంతరం అరుణ పరిస్థితి విషమించటంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రి సిబ్బంది. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది అరుణ. పి.హెచ్.సి సెంటర్ వైద్యుల నిర్లక్ష్యం వల్లనే చనిపోయారంటూ బంధువులు ఆరోపణలు వస్తున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news