సూరారంలో అదృశ్యమైన బాలిక మృతదేహం లభ్యం..!

-

ఈ మధ్య కాలంలో బాలికలు, చిన్నారులు ఎక్కువగా అదృశ్యం అవుతున్నారు. ముఖ్యంగా కొందరూ దుండగులు వీరిని కిడ్నాప్ చేసి డబ్బు లాగేందుకు కొందరూ యత్నిస్తుంటే.. మరికొందరూ వారి కుటుంబ సభ్యులతో గతంలో జరిగిన గొడవలు, వివాదస్పద సంఘటన కారణంగా వారి పిల్లలను తీసుకెళ్లి.. చిత్ర హింసలకు గురిచేయడం.. కొందరినీ అయితే కక్ష్య కొద్ది హత మార్చుతున్న ఘటనలు చాలానే చూస్తున్నాం.

తాజాగా  సూరారంలో 12 ఏళ్ల బాలిక అదృశ్యం అయింది. సూరారంలో కనిపించకుండా పోయిన బాలిక మృతదేహం లభ్యమైంది. మేడ్చల్లో గోనె సంచిలో బాలిక మృత దేహాన్ని కనుగొన్నారు అధికారులు. సూరారంలో ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయింది బాలిక..దీంతో  బాలిక అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు  తల్లిదండ్రులు. నిన్నటి నుంచి బాలిక కోసం  నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపులు చేపట్టారు. తాజాగా బాలిక మృత దేహం లభ్యమైంది. దీంతో బాలికని ఎత్తుకెళ్లి చంపి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలికను ఎవరూ ఎత్తుకెళ్లారు..? ఎందుకు తీసుకెళ్లారు..? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version