విషాదం.. కుక్కల దాడిలో 6 ఏళ్ల బాలుడు మృతి

-

కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలుడు తెల్లారేసరికి విగతజీవిలా మారి కనిపించాడు.  హైదరాబాద్‌ మియాపూర్‌ మక్తా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్తా సమీపంలో భిక్షాటన చేస్తూ ఓ కుటుంబం నివసిస్తోంది. వారికి చెందిన ఆరేళ్ల బాలుడు సాత్విక్‌ మంగళవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయాడు.  ఎంత వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు.  ఈ ఉదయం మక్తా సమీపంలోని డంపిగ్‌ యార్డు సమీపంలో సాత్విక్‌ శవం లభ్యమైంది.

బాలుడి శరీరంపై కుక్కలు దాడి చేసిన గాయాలున్నాయి. పిచ్చికుక్కల దాడిలోనే సాత్విక్‌ చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ డంపింగ్ యార్డు దగ్గర ఉండటంతో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. దీనివల్ల తమ పిల్లల ప్రాణాలకు హాని ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version