ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు : చంద్రబాబు

-

కూటమి ఘనవిజయంపై ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఆయన మీడియా సహా రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు. శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. తన సుదీర్ఘ రాజకీయ యాత్రలో ఈ ఐదేళ్లు చూసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో చూశామన్న చంద్రబాబు.. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలన్నదే తమ ధ్యేయం అని పేర్కొన్నారు.

‘ఎన్ని త్యాగాలు చేసైనా భావితరాల భవిష్యత్తు కోసం ముందుకెళ్లాం. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. దేశం, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి కూడా తపనతో వచ్చి పనిచేశారు. పక్క రాష్ట్రాల్లో కూలీ పనులకు వెళ్లిన వ్యక్తులు కూడా వచ్చి ఓటు వేశారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది.’ అని చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version