పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌ రెడ్డి

-

తెలంగాణలో వరంగల్, ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి బరిలో దిగనున్నారు. రాకేశ్‌రెడ్డి పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఆ స్థానం నుంచి ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీగా రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉపఎన్నికకు పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేరును బీఆర్ఎస్ ప్రకటించింది.

విద్యావంతుడైన ఏనుగుల రాకేశ్‌రెడ్డి స్వస్థలం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌. బీజేపీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆయన నగరంలోని అనేక సమస్యలపై పోరాటాలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ టికెట్టు దక్కకపోవడంతో బీఆర్ఎస్​లో చేరారు. పలువురు పేర్లను పరిశీలించిన బీఆర్ఎస్ అధిష్ఠానం విద్యావంతుడైన రాకేశ్‌రెడ్డి వైపు మొగ్గు చూపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం రావడంతో హన్మకొండలోని రాకేశ్‌రెడ్డి ఇంటివద్ద కోలాహలం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version