ఫార్ములా ఈ రేసు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేసు కేసులో మొబైల్ ఫోన్ సమర్పించాలని ఎసిబి ఇచ్చిన నోటీసుకు లేఖ ద్వారా సమాధానం పంపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అని లేఖలో కేటీఆర్ స్పష్టం చేశారు.

గౌరవ సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పిందని వెల్లడించారు కేటీఆర్. 2024 మొదటి త్రైమాసికంలో తాను మొబైల్ ఫోన్ మార్చానని, తాను గతంలో వాడిన ఆ పాత ఫోన్ ఇప్పుడు తన దగ్గర లేదని కేటీఆర్ స్పష్టంచేశారు. తాను ఫోన్ కాకుండా ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను వాడలేదని ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు.