చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మోడీ నువ్వు చెప్పినట్టు విన్నంత మాత్రాన అన్ని ప్రాజెక్టులకు అనుమతులు రావు అని ఆగ్రహించారు. బంకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రోజెక్టులు పూర్తి చేయడానికి నిధులు లేవు, నీళ్లు కూడా ఆగుత లేవు.. నీళ్లు కిందకి పోతే చంద్రబాబు ఎత్తుకు పోతున్నాడు అని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సూచనలు చేశారు. మా ప్రయోజనాలు వదులుకోం.. మా హక్కులు హరిస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామంటూ తెలిపారు రేవంత్. గోదావరిలో మా హక్కుగా ఉన్న 968 టీఎంసీల వినియోగానికి అనుమతించాలన్నారు.
తెలంగాణకు అన్యాయం చేసిందే కేసీఆర్ అని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఎక్కడా నిర్లక్ష్యం వహించడం లేదు… ప్రభుత్వం, రాజ్యాంగబద్ద సంస్థలు కేంద్రానికి అన్ని రకాలుగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాయని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.