హైదరాబాద్ కు చెందిన జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు నమోదు..!

-

హైదరాబాద్ కు చెందిన ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు నమోదు అయ్యింది జీఎస్టీ సూపరింటెండెంట్ ఆనంద్ కుమార్ తో పాటు ఇన్స్పెక్టర్ మనీష్ శర్మ పై కేసు నమోదు చేసింది సీబీఐ. అయితే ఓ వ్యక్తి నుండి లంచం డిమాండ్ చేసారు ఈ జీఎస్టీ అధికారులు. దాంతో సీబీఐని ఆశ్రయించాడు బాధితుడు. ఐరన్ స్క్రాప్ గోదాం లో అక్రమాలపై ఫైన్ విధించారు జీఎస్టీ అధికారులు.

అలాగే బాధితుడు నుండి ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు జీఎస్టీ అధికారులు. స్క్రాప్ గోదామును సీజ్ చేసిన అధికారులు.. అనంతరం ఈ సీజ్ చేసిన గోదాంను ఓపెన్ చేసేందుకు మరో 3 లక్షలు డిమాండ్ చేసారు. దాంతో బాధితుడు సీబీఐని ఆశ్రయించగా.. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసారు సీబీఐ అధికారులు. అనంతరం రెండు ప్రాంతాల్లో సోదాల నిర్వహించిన సీబీఐ అధికారులు… సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version