చంద్రబాబు కంటికి ఆపరేషన్ పూర్తి..డిశ్చార్జ్

-

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయింది. గత కొద్ది రోజులుగా కుడి కంటి సమస్యలతో చంద్రబాబు నాయుడు బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే మద్యంతర బెయిల్ పై విడుదలైన చంద్రబాబు నాయుడు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం వైద్యులు మంగళవారం కుడికంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని సూచించారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇవాళ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి చేరుకున్నాడు. ఎల్వీ ప్రసాద్ వైద్యులు చంద్రబాబు కుడి కంటికి కాటరాక్ట్ ఆఫరేషన్ నిర్వహించారు. 2 గంటల పాటు శ్రమించిన వైద్యులు చంద్రబాబు కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసారు. చంద్రబాబు నాయుడిని డిశ్చార్జ్ చేశారు. శస్త్ర చికిత్స ముగిసిన వెంటనే చంద్రబాబు జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. ప్రస్తుతం చంద్రబాబును చూసేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version