BREAKING : రాహుల్ గాంధీ షెడ్యూల్‌లో మార్పులు

-

రాహుల్ గాంధీ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కొండగట్టు సందర్శన వాయిదా పడిపోయింది. రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో షెడ్యూల్ కుదించారు కాంగ్రెస్‌ పార్టీ నేతలు. దీంతో కరీంనగర్ నుంచి జగిత్యాలకు రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. అక్కడే కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు రాహుల్ గాంధీ.

కోరుట్ల కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న రాహుల్.. లంచ్.. తర్వాత నేరుగా ఆర్మూర్‌కి వెళతారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 2.30కి సభ జరుగనుండగా..ఆ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో హైదరాబాద్‌కి ఆ తర్వాత ఢిల్లీకి రాహుల్‌ గాంధీ వెళతారు.

కాగా ఆరు గ్యారంటీలను మొదటి కేబినెట్‌లోనే ఆమోదిస్తాం.. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతామని నిన్న రాహుల్ గాంధీ ప్రకటించారు.. కేసీఆర్ ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం రాబోతుంది.. బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి కాంగ్రెస్‌ను ఓడించాలని చూస్తున్నాయన్నారు రాహుల్ గాంధీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version