BREAKING: ఇవాళ తిరుమలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

-

BREAKING: ఇవాళ తిరుమలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం బషీర్ బాగ్ లోని పరిశ్రమల భవన్ కు సిఎం రేవంత్ రెడ్డి వెళతారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, పెట్టుబడులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం దాదాపు 3 గంటలకు జరుగనుంది. ఇక అనంతరం ఏపీకి వెళతారు సీఎం రేవంత్‌.

Chief Minister Revanth Reddy off to of Tirumala today

ఇవాళ రాత్రి లేదా సాయంత్రం తిరుపతి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఛాన్స్‌ ఉంది. అయితే.. తిరుమలకు కుటుంబ సమేతంగా సీఎం రేవంత్‌ వెళతారా ? లేదా ? సీఎం హోదాలో వెళ్లి….తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారా ? అనేది తెలియాల్సి ఉంది. ఇవాళ్టి నుంచే తిరుమలలో వీఐపీ దర్శనాలు ప్రారంభం అయ్యాయి. దీంతో నేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు సీఎం రేవంత్‌. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version