ఏపీకి తుపాను ముప్పు లేనట్లే..! : వాతావరణ శాఖ

-

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. తుపానుగా బలపడిన తర్వాత ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరాల వైపు పయనిస్తుందని అంచనా వేస్తోంది. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుపాను ముప్పు ఉండదని పేర్కొంది. అల్పపీడనం ఏర్పడ్డాక మరింత స్పష్టత వస్తుందని తెలిపింది.

బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు.  మరోవైపు ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని తెలిపారు. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version