తెలంగాణలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదు – చికోటి ప్రవీణ్

-

తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని సంచలన ప్రకటన చేశారు ధర్మ రక్ష ఫౌండేషన్ చైర్మన్ చికోటి ప్రవీణ్. వారంలో రోజుల్లో పొలిటికల్‌ ఎంట్రీపై ప్రకటన చేస్తాననిపేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా మల్టీ బ్రాండ్ బైస్కిల్ షోరూమ్ ను ప్రారంభించారు ధర్మ రక్ష ఫౌండేషన్ చైర్మన్ చికోటి ప్రవీణ్. తన మేనల్లుడి మల్టీ బ్రాండ్ బైక్ షోరూం ప్రారంభించారు చీకోటి ప్రవీణ్.

chikoti praveen
chikoti praveen

ఈ సందర్భంగా చీకోటి ప్రవీణ్ మాట్లాడుతూ.. ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించడం సంతోషంగా ఉందని… తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం కొరకు పాటుపడే వారికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని వెల్లడించారు. ఎలక్షన్లో పోటీ చేసే అంశాన్ని వారం పది రోజుల్లో వెల్లడిస్తానని ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని నాలుగు ఐదు వేల ఓట్లతో అభ్యర్థులు గెలుస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవుళ్లను హిందూ సమాజం కొరకు పనిచేసే ఏ ప్రభుత్వానికైనా తన పూర్తి ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు హిందూ సమాజం కొరకు పాటుపడే వారికే ఓటు వేయాలని పిలుపునిచ్చారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news