BREAKING : ఇంకా కోలుకోని సీఎం కేసీఆర్!

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గత పది రోజులుగా వైరల్ ఫీవర్ కారణంగా… ప్రగతి భవన్ లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు సీఎం కేసీఆర్. అయితే వైరల్ ఫీవర్ వచ్చి పది రోజులు అయినప్పటికీ సీఎం కేసీఆర్ ఇంకా కోలుకోలేదని సమాచారం అందుతోంది.

ఇవాళ రావివ్యాలలో విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించాల్సి ఉండగా… తన అనారోగ్యం కారణంగా సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదు. నిన్న నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి…. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తో భేటీ అయ్యారు. టికెట్ విషయంపై అడగగా… తన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని… మాట్లాడలేకపోతున్నానని సీఎం కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. కాగా…తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ నేడు లాంఛనంగా ప్రారంభంకానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version