వియ్యంకుడి భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ మామగారు ( భార్య తండ్రి) సీఎం కేసీఆర్ వియ్యంకులు పాకాల హరినాధ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. నిన్న సాయంత్రం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. ఆయనను బతికించడానికి వైద్యులు అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.

కాగా తన వియ్యంకుడు, మంత్రి కె. తారకరామారావు మామగారు పాకాల హరినాథరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గం వద్ద గల వారి నివాసానికి వెళ్ళి దివంగత హరినాథరావు భౌతిక కాయానికి సీఎం నివాళులర్పించారు. తండ్రిని పోగొట్టుకున్న దుఃఖంతో ఉన్న తమ కోడలు శైలిమను, శోకతప్తులైన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి దంపతులు ఓదార్చారు. హరినాథరావు ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ భగవంతున్ని ప్రార్థించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version