నేడు 4 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు

-

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులొడ్డి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. అయితే ఈసారి ఎన్నికల ప్రచారంలో కేవలం ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు ఎక్కుపెట్టడమే కాకుండా ప్రజలకు ఓటు హక్కు గురించి వివరిస్తున్నారు నాయకులు. ముఖ్యంగా సీఎం కేసీఆర్.. తాను పాల్గొంటున్న ప్రతి ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగాన్ని ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూనే షురూ చేస్తున్నారు. ప్రజల చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధం ఐదేళ్ల వారి భవిష్యత్​నే కాకుండా రాష్ట్ర భవిష్యత్​ను కూడా మార్చేస్తుందంంటూ ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మహేశ్వరం, వికారాబాద్‌, జహీరాబాద్‌, పటాన్‌చెరులో నిర్వహించనున్న సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. కేసీఆర్ ప్రసంగాల్లో ఎక్కువగా కాంగ్రెస్​పై విమర్శలు.. తొమ్మిదన్నరేళ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి గురించే ఉంటోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version