Breaking : ఢిల్లీ ఎయిమ్స్ లో సీఎం కేసీఆర్ స‌తీమణీ శోభ‌

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ స‌తీమణి శోభ ఢిల్లీ లో ఉన్న ఎయిమ్స్ ఆస్ప‌త్రి లో ఈ రోజు చేరారు. సీఎం కేసీఆర్ స‌తీమ‌ణి శోభ గ‌త కొద్ది రోజుల నుంచి ఊపిరితిత్తుల స‌మ‌స్య ల తో బాధ ప‌డుతున్నార‌ని తెలుస్తుంది. దాని కోస‌మే సీఎం కేసీఆర్ స‌తీమ‌ణి శోభ ఎయిమ్స్ లో చేరాని స‌మాచారం. రెండు రోజుల క్రిత‌మే మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ క‌విత ఢిల్లీ కి వెళ్లారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ కూడా ఢిల్లీ కి చేరారు.

కాగ సీఎం కేసీఆర్ కు ఆయ‌న స‌తీమ‌ణి శోభ కు గ‌తంలో కరోనా వైర‌స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే కరోనా వ‌చ్చిన నాటి నుంచి సీఎం కేసీఆర్ స‌తీమ‌ణి శోభ ఆరోగ్యం లో మార్ప‌లు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. అలాగే ఊపిరితిత్తుల స‌మ‌స్య కూడా వ‌చ్చింది. అందు కోసమే ఈ రోజు ఎయిమ్స్ లో చేరారు. అయితే నేడు ముఖ్య మంత్రి కేసీఆర్ కూడా ఢిల్లీ కి చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఆయ‌న ఢిల్లీ లోనే ఉండ‌నున్నారు. తెలంగాణ లో పండించే వ‌రి ధాన్యం గురించి కేంద్ర మంత్రుల‌తో చ‌ర్చించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news