రేపు హుజూర్ నగర్ కు సీఎం రేవంత్ రెడ్డి

-

రేపు హుజూర్ నగర్ కు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రేపు హుజూర్ నగర్ వేదికగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు.

CM Revanth Reddy to visit Huzurnagar tomorrow

త్వరలో ఉప్పు, పప్పు, చింతపండు వంటి సరుకులు కూడా రేషన్ ద్వారా పంపిణీ చేయనున్నారు. కొత్తగా మరో 30 లక్షల మందిని రేషన్ కు అర్హులుగా గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ తరుణంలోనే రేపు హుజూర్ నగర్ వేదికగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news