రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

-

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్లుండి హస్తినలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) మీటింగ్లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పర్యటనలో క్యాబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి.. పదవి చేపట్టిన తర్వాత.. దాదాపు 20కి పైగా ఢిల్లీకి వెళ్లారు.

కాగా, నిన్న కొంగరకలాన్ ఫాక్స్ కాన్ కంపెనీని సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…ఫాక్స్ కాన్ చైర్మన్ యాంగ్ లియూ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని భరోసా ఇచ్చారు. మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version