సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లా నేడుపర్యటన ఖరారు ఐంది. యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండనుంది. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో రూ.1500 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

గంధమల్ల రిజర్వాయర్ ,మెడికల్ కాలేజ్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, వేద పాఠశాలలకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం తిరుమలాపురంలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది.