కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ తనపై దాడి చేశాడు : ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

-

అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ తనపై దాడి చేశాడని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. ఇవాళ అపోలో ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. అంతకు ముందు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు గాయాలపాలైన గువ్వల బాలరాజును పరామర్శించారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. ముఖ్యంగా కాంగ్రెస్ గుండాలు.. కెమెరామెన్ లు దాడి చేసి.. కెమెరాలను, కార్లను ధ్వంసం చేసి అనుసరించారు. నడుచుకుంటూ వెళ్తున్న కొంత మందిపై విచక్షణ రహితంగా దాడి చేశారు.

ఇప్పటివరకు నా కోసమే పని చేస్తున్న నా మీద.. నా అనుచరులపై దాడి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణ గతంలో నాపై దాడి చేశారు. దాడులు సరి కాదు.. దమ్ముంటే చూసుకుందాం అన్నారు. వంశీ కృష్ణనే తనపై దాడి చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నా ప్రజలు.. అచ్చంపేట యువత మహిళా లోకం యువ ఓటర్లు అండగా ఉన్నారు. పగలు, ప్రతీకారాలు నా సంస్కృతి కాదు.. నా కాన్వాయ్ ని వెంబడించి దాడి చేశారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రమాదం నుంచి బతికి బయటపడ్డాను. మీ అందరి దీవెనలు ఉన్నంత వరకు గువ్వల బాలరాజుకు ఏమి కాదు. అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతు చేయాలంటే ప్రజా క్షేత్రంలో ఉండాలి. తాను ఉన్నా లేకపోయినా అచ్చంపేటలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news