కేటీఆర్ చెప్పు దెబ్బలు తినడం పక్కా : సునీత రావు

-

మాజీ మంత్రి కేటీఆర్.. మంత్రి కొండా సురేఖను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇదే వ్యాఖ్యల పై తాజాగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు స్పందించారు. కేటీఆర్ కు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. త్వరలో చెప్పు దెబ్బలు తింటాడు అని అన్నారు. మొన్న కౌశిక్ రెడ్డి ఇప్పుడు కేటీఆర్.. ఇద్దరు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. మహిళను గౌరవించాలన్న కనీస తెలివి లేదా కేటీఆర్ అని ఆమె ప్రశ్నించారు.

ఇలానే ఉంటె ఏదైనా మహిళా సభకు వెళ్లిన రోజు కేటీఆర్ చెప్పు దెబ్బలు తినడం పక్కా. నీ కంటే కేసీఆర్ నయం.. ఇన్నేళ్లల్లో మహిళలను ఒక్క మాట అనలేదు. నీకు కూడా భార్య పిల్లలు ఉన్నరు కదా.. కానీ మహిళల పట్ల గౌరవం లేదా అని అన్నారు. డ్రగ్స్ ను హైదరాబాద్ లో విచ్చలవిడిగా అలవాటు చేసిందో ఎవరో అందరికీ తెలుసు. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి.. చెప్పు దెబ్బలు మాత్రం పక్కా అని సునీత రావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version