కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షాక్.. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నేతల డిమాండ్

-

భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఊహించని తగిలింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నేతలే అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చారు. ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై హైకమాండ్ కు పీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ పిర్యాదు చేసారు.

సోనియాకు రాసిన పిర్యాదు లేఖను మాణిక్యం ఠాగూర్, రేవంత్ రెడ్డి, చిన్నా రెడ్డి లకు అందజేసారు బక్క జడ్సన్. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తో ఎంపి కోమటిరెడ్డి సన్నిహితంగా మెలగడం పై సోనియా గాంధీకీ పిర్యాదు చేశారు. ఉత్తం కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాకనే కాంగ్రెస్ లో కొందరు అధికార పార్టీ తో అంటగాగుతున్నారని ఫైర్ అయ్యారు.

పార్టీ ముఖ్యనేతలు ఇలా టీఆరెఎస్ పార్టీతో సన్నిహితంగా ఉండటం పార్టీకి నష్టమని పేర్కొన్నారు. సిఎం కేసీఆర్ ప్రభుత్వం పై చేస్తున్న పోరాటాన్ని ఇలాంటి నేతల వల్ల నీరు గారుతోందని అగ్రహించారు. తక్షణం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్. ఇక దీనిపై కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version