వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు రద్దు చేస్తామని బాంబు పేల్చారు. ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు కోసం లంచం ఇచ్చినట్లుగా తేలితే వారికి ఇల్లు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.

అదే సమయంలో లంచం తీసుకున్న లేదా ఇచ్చిన వారి వివరాలు వెల్లడిస్తే 25 వేల రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. లంచం తీసుకున్న వారిలో పార్టీ కార్యకర్తలు ఉంటే సస్పెండ్ చేస్తామని కూడా స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇంట్లో కోసం మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోకూడదని లబ్ధిదారులకు సూచనలు చేశారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.
వారికి ఇందిరమ్మ ఇళ్లు రద్దు చేస్తాం: కాంగ్రెస్ ఎమ్మెల్యే
వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు లంచం ఇచ్చినట్లుగా తేలితే వారికి ఇళ్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. లంచం తీసుకున్న లేదా ఇచ్చిన వారి వివరాలు వెల్లడిస్తే రూ.25… pic.twitter.com/QWrz9fh5kG
— ChotaNews App (@ChotaNewsApp) June 3, 2025