ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుల అరెస్టు..!

-

ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే కీలక నిందితులు ఇప్పటికే అరెస్టు చేశాం అని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు లపై రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయాలని సీబీఐ డైరెక్టర్ ని కోరాం. సీబీఐ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన తర్వాత నిందితులను త్వరగా ఇండియాకి తీసుకువస్తాం అని అన్నారు.

మొదట బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయాలనుకున్నాం. కానీ బ్లూ కార్నర్ నోటీస్ తో యుఎస్ గవర్నమెంట్ వ్యక్తులని మనకి హ్యాండ్ ఓవర్ చెయ్యదు. కాబట్టి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని సీబీఐ డైరెక్టర్ కి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. సీబీఐ డైరెక్టర్ కి పూర్తిగా కేసు వివరాలు అర్థమయ్యాయి. ఈ కేసు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని త్వరగా విచారిస్తాం అని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version