హరగోపాల్ పై కేసును వెనక్కి తీసుకున్న పోలీసులు..సీపీఐ కీలక ప్రకటన

-

ప్రొఫెసర్ హరగోపాల్ పై కేసును వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక ప్రకటన చేశారు. ప్రముఖ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ హరగోపాల్ తో పాటు 152 మందిపై ములుగు పోలీస్ స్టేషన్లో ఉపా కేసు నమోదు చేయడానికి సిపిఐ తో పాటు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపా కేసును వెనక్కి తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేయడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతించారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ ప్రొఫెసర్ హరగోపాల్ తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక ప్రజా పోరాటాల్లో పాల్గొని మద్దతు తెలిపారని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని యావత్తు దేశానికి తెలిసే విధంగా ఆయన ప్రసంగాలు చేశారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version