తెలంగాణలో మరో దిశా ఘటన…మహిళను అత్యాచారం చేసి !

-

Telangana : తెలంగాణలో మరో దిశా తరహా ఘటన చోటు చేసుకుంది…మహిళను అత్యాచారం చేసి…పెట్రోల్‌ పోసి తగలబెట్టినట్లు సమాచారం. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వికారాబాద్‌ జిల్లా పులుమద్ది శివారులో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. వికారాబాద్‌ జిల్లా అటవీ ప్రాంతంలో పూర్తిగా కాలిన మహిళ మృతదేహం లభ్యం అయింది.

crime in vikarabad

అయితే… అత్యాచారం చేసి.. ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించిన పోలీసులు…నిందితుల కోసం గాలింపు చేస్తున్నారు. మూడు ప్రత్యేక బృందాలుగా విడిపోయి… గాలిస్తున్నారు. మృతదేహం పూర్తిగా తగలబడటంతో మృతురాలిని పోలీసులు గుర్తించలేకపోయారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news