సిరిసిల్లాలో పవర్‌ లూమ్‌ కార్మికుడు ఆత్మహత్య..కాంగ్రెస్‌ పై విమర్శలు !

-

BREAKING : సిరిసిల్లాలో పవర్‌ లూమ్‌ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పవర్ లూమ్‌ వలుస కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. తంగళ్లపల్లి మండలం టెక్స్‌టైల్స్ పార్కు ఇందిరమ్మ కాలనీలో ఉత్తరప్రదేశ్ కు చెందిన అలోక్ కుమార్(55) అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు…దర్యాప్తు చేస్తున్నారు.

అయితే..పవర్‌ లూమ్‌ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న తరుణంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ సర్కార్‌ పాలనలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆగ్రహిస్తున్నారు. ఇక అటు పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ యజమానుల మెరుపు సమ్మెపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. వస్త్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టొద్దని..గత ప్రభుత్వ విధానాలు కొనసాగిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news