తెలంగాణ రైతులకు శుభవార్త.. రేపు 2 లక్షల రుణమాఫీ

-

తెలంగాణ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేపే రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. మూడో విడత కింద లక్షన్నర నుంచి 2 లక్షల వరకు రుణమాఫీని చేయనున్నారు సీఎం రేవంత్. ఈ మహోత్తర కార్యక్రమం ఆగస్టు 15వ తేదీ అంటే రేపు ఖమ్మం జిల్లా వైరాలో ప్రారంభం కానుంది.

Good news for Telangana farmers

అమెరికా నుంచి ఇవాళ హైదరాబాద్ చేరుకోనున్నారు రేవంత్ రెడ్డి. ఆ వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. ఈ చివరి విడతలో దాదాపు 14 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. 20 లక్షలకు పైగా కొత్త రైతులకు రుణమాఫీ అయినట్లు భావించాలి. అయితే ఐటీ రిటర్న్స్ అలాగే ఒకే రేషన్ కార్డులో ఇద్దరు పేర్లు ఉంటే కూడా చాలామందికి రుణమాఫీ కాలేదని విమర్శలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news