మేఘా కంపెనీ పై సైబర్ ఎటాక్..5 కోట్లు మాయం !

-

మేఘా కంపెనీ పై సైబర్ ఎటాక్ చేసింది. నకిలీ ఈమెయిల్ ద్వారా 5 కోట్ల 47 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. దీంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు మేఘా సంస్థ అకౌంట్ మేనేజర్ శ్రీహరి. మేఘా కంపెనీకి అవసరమైన ఎక్విప్మెంట్ నెదర్లాండ్స్ కి చెందిన ఓ కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చారు. ఆ కంపెనీకి ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లింపులు చేశారు. చెల్లింపుల తర్వాత ప్రతిసారి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేదని అంటున్నారు.

Cyber ​​attack on Megha company

అయితే ఇక్కడే ఆ కంపెనీ లాగానే ఈ-మెయిల్లో ఒక అక్షరం మార్చి.. కొన్ని కారణాలవల్ల మీరు పంపించే అకౌంట్ పనిచేయడం లేదు మరో అకౌంట్ కి డబ్బులు చెల్లించాలంటూ మేఘా కంపెనీకి మెయిల్ పంపించారట సైబర్ నేరగాళ్లు. అది నిజమని నమ్మి 5 కోట్ల 47 లక్షలు రెండు విడతలుగా చెల్లించిందట మేఘా కంపెనీ. అదే కంపెనీ నుండి మరో మెయిల్ డబ్బులు ఇంకా చెల్లించలేదని రావడంతో.. మోసపోయామని గ్రహించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేసింది మేఘా కంపెనీ. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news