మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం..!

-

మెదక్ జిల్లా శివంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం కారు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొని రత్నాపూర్ వద్ద కాలువలోకి దూసుకెళ్లింది.  ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఉసిరికపల్లి నుంచి వెల్దుర్తి వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా.. వేగంగా వచ్చిన ఆ కారు.. రహదారి పై ఉన్న గుంతలో పడటంతో అదుపు తప్పి ఆ తర్వాత ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న గుంతలో పడటంతో గాల్లోకి ఎగిరి రహదారి పక్కకు దూసుకెళ్లినట్టు సమాచారం.

ఈ ప్రమాదం జరగడం గమనించిన స్తానికులు కారును వెలికితీసి డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులు రత్నాపూర్, తాళ్లపల్లి, పాముతండా వాసులుగా గుర్తించారు. మరణించిన వారిలో ఒక వ్యక్తి, నలుగురు మహిళలు, ఇద్దరూ బాలికలు ఉన్నారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version