డీఎస్ మరణం చాలా బాధకరం : ప్రధాని మోడీ

-

రాజకీయ కురువృద్ధుడు, మాజీ మంత్రి డి.శ్రీనివాస్ ఇవాళ మృతి చెందిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న డీఎస్.. శనివారం తెల్లవారుజూమున గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన డీఎస్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే డీఎస్ మరణం పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. మాజీ ఎంపీ డీఎస్ మరణం నన్ను ఎంతో బాధించిందని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసేవకు, పేద ప్రజల సాధికారతకు సుదీర్ఘకాలం పాటు ఆయన చేసిన కృషి మరిచిపోలేనిదని కొనియాడారు. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. కాగా, డీఎస్ చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీ ఎంపీగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version