ముసద్దీలాల్ జువెల్లర్స్ డైరెక్టర్‌ సుఖేశ్‌ గుప్తా అరెస్టు

-

ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జువెలర్స్ డైరెక్టర్ సుఖేశ్ గుప్తాను ఈడీ అరెస్ట్ చేసింది. ఎంఎంటీసీ నుంచి తీసుకున్న బంగారానికి డబ్బులు చెల్లించకపోవడంతో సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు రెండ్రోజులు సోదాలు నిర్వహించి ముసద్దీలాల్ జువెలర్స్​లో దాదాపు రూ.100 కోట్లకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సుఖేశ్ ​గుప్తాను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. సుఖేశ్ గుప్తాను కస్టడీలోకి తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

ఎంఎంటీసీలోని కొందరు అధికారులతో కుమ్మక్కైన సుఖేశ్​ గుప్తా తగినంత సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించకపోవడమే కాకుండా.. ఫారెక్స్ కవర్ లేకుండానే భారీ ఎత్తున బంగారాన్ని తెచ్చారనేది ప్రధాన ఆరోపణ. ఎంఎంటీసీ నుంచి తీసుకున్న బంగారానికి పూర్తిస్థాయిలో చెల్లింపులు చేయకపోయినా కొందరు అధికారుల సహకారంతో.. సంస్థ ప్రధాన కార్యాలయానికి తప్పుడు వివరాలు సమర్పించారని దర్యాప్తులో తేలింది.

ఎంబీఎస్ వ్యవహారంపై దృష్టిసారించిన ఈడీ గతేడాది ఆస్తులను జప్తు చేయడం సహా రెండు రోజులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఆ సోదాల్లో దాదాపు రూ.100 కోట్లకుపైగా విలువైన బంగారంతో పాటు, వజ్రాలతో తయారుచేసిన ఆభరణాలు, కీలకమైన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version