పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన ఈటెల

-

హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపికి గుడ్ బై చెప్పబోతున్నారా? తిరిగి మల్లి టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారా? కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం ఇది. వామపక్ష భావజాలంతో రాజకీయంగా ఎదిగిన ఈటెల రాజేందర్.. బిజెపిలో ఇమడలేక పోతున్నారని ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ అంశంపై ఈటెల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు.

టిఆర్ఎస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఈటెల రాజేందర్. మరోవైపు కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా బిజెపిలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన కూడా స్పందించారు. ఆయన బిజెపిలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నా నేపథ్యంలో తాను పార్టీ మారడం లేదని మీడియాతో చెప్పారు. తన మనవడి స్కూల్ ప్రోగ్రాం కోసమే తాను ఢిల్లీకి వచ్చానని.. తాను వచ్చిన విమానంలో బిజెపి నేతలు ఉండడంతో అందరూ అలా అనుకున్నారని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version