ప్రతీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అవినీతి పరుడే : జేపీ నడ్డా

-

బీఆర్ఎస్ ప్రతి ఎమ్మెల్యే అవినీతిపరుడైన అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఇవాళ ఎర్రగడ్డ లో ప్రధాని మోడీ మాన్ కీ బాత్ 107 వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్థానిక ప్రజలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ అవినీతి మయం అయిందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ రఫెల్ కామన్వెల్త్ 2g 3g పేరుతో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.

కాలేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని.. ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎం మాదిరిగా మారిందని విమర్శించారు. ప్రధాని ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల ఇల్లు నిర్మించామని.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని కెసిఆర్ ఇక్కడ అమలు చేయడం లేదని మండిపడ్డారు. కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశారని.. కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలని ఆరోపించారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ఉజ్వల యోజన పథకం కింద ప్రతి ఏడాది ఉచితంగా నాలుగు సిలిండర్లు, ఎరువులు, సబ్సిడీకి అందిస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version