కెసిఆర్ ప్రభుత్వం పేకమేడ..ఏ క్షణం అయినా కూలిపోతుంది -ఈటల

-

మాజీ మంత్రి, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం పేకమేడ.. ఏ క్షణం అయినా కూలిపోతుందని ఈటల రాజేందర్ అన్నారు. ఏ క్షణం అయినా కూలిపోతుందని.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ను బ్రహ్మదేవుడు కూడా కాపడలేడని పేర్కొన్నారు. మీటింగ్ రావాలంటే ఉద్యోగులు భయపడుతున్నారని.. రెవెన్యూ డిపార్మెంట్ అంపశయ్య మీద ఉందన్నారు.

దాసోజు శ్రవణ్ పీసీసీ చీఫ్ నిర్ణయాలు నచ్చక బయటకు వచ్చారు ఇంకా చాలా మంది నేతలు వస్తారని, సిద్దిపేటకు చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్, టీఆర్‌ఎస్‌ నేత మురళి యాదవ్ బీజేపీ లో చేరుతున్నారని ఆయన తెలిపారు. కన్నెబొయిన రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు తో పాటు 10 నుంచి 20 మంది నేతలు ఈనెల 21 వ తేదీన అమిత్ షా సమక్షంలో చేరుబోతున్నట్లు సంచలన విషయాలు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ కు పరాభవం తప్పదన్నారు ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version