వైఎస్ షర్మిలతో మాజీ ఎంపీ పొంగులేటి భేటీ

-

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి భేటీ అయ్యారు. కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్న ఆయన షర్మిలతో భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. చాలా రోజులుగా పొంగులేటి బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా పొద్దు ముగిసిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికి వస్తుందన్నది వాస్తవమని ఇటీవల ఆయన ఆత్మీయ సమ్మేళనంలో వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలతో ఆయన సొంతగూటికి చేరతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన షర్మిలతో భేటీ కావడంతో ఆయన వైఎస్సార్టీపీలో చేరతారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకిచ్చిన మాట తప్పారని.. ఇన్నేళ్లు ఆయన మాటకు కట్టుబడి ఉన్నానని పొంగులేటి అన్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్​గానైనా పోటీ చేయాలని ఎంతోమంది కోరినా తాను నిరాకరించానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లుగా తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోయానని వాపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version