బయ్యారం మండల కేంద్రంలో మాజీ మంత్రి తుమ్మలకు నిరసన సెగ

-

మహబూబ్నగర్ జిల్లా: నేడు బయ్యారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వస్తుండగా వారికి నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే హరిప్రియని చుట్టుముట్టారు రైతులు. 20 రోజుల నుండి మొక్కజొన్నలను కొనుగోలు చేయడం లేదంటూ నిలదీశారు. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్ ని కూడా అడ్డుకున్నారు.

20 రోజుల నుండి మొక్కజొన్నను కాపలా కాయడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వెంటనే మొక్కజొన్నను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే అకాల వర్షాల వల్ల ఇప్పటికే సగం పంట నష్టపోయామని.. ఇప్పటికైనా తమను ఆదుకోవాలని, మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని కోరారు. తమకు న్యాయం జరిగే వరకూ కదిలేదే లేదని అడ్డు తగలడంతో పోలీసులు రైతులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version