Fatal accident in Medak Four killed: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట 44వ జాతీయ రహదారి వడియారం బైపాస్ దగ్గర ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చి మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక లారీలో ఉన్న నలుగురు మృతి చెందారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/06/Fatal-accident-in-Medak-Four-killed.webp)
మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ డ్రైవర్ల తప్పు ఉందా..లేక ఎవరైనా తాగి ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.