బోయిన్‌పల్లిలో విషాదం.. కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్య!

-

సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలకు నిద్రమాత్రలు ఇచ్చి.. తాను కూడా మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భవానీనగర్‌లో నివాసం ఉండే శ్రీకాంతాచారికి, భూదాన్‌పోచంపల్లికి చెందిన అక్షయకు ఇద్దరు పిల్లలు శ్రావ్య, స్రవంతి ఉన్నారు. రోజు మాదిరిగానే నిన్న రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేసి, నిద్రించారు. ఉదయం శ్రీకాంతాచారితో పాటు ఇద్దరు పిల్లలు శ్రావ్య, స్రవంతి విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఘటనకు గల కారణాలను విచారిస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్‌టీం శ్రీకాంత్‌ నిద్రించిన ఇంట్లో ఆధారాలు సేకరించింది. ప్రాథమికంగా శ్రీకాంత్ భార్య అక్షయను ప్రశ్నించిన పోలీసులు…. మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది.

మరోవైపు శ్రీకాంత్​తో పాటు ఇద్దరు పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు బోయిన్​పల్లి సీఐ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version