శభాష్‌ కేటీఆర్..మరో ఇద్దరు విద్యార్థులకు ఆర్థిక సాయం

-

మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. పేదరికం వలన ఉన్నత విద్య అందుకోలేకపోతున్న ఇద్దరు బాలికలు ఆర్థిక సహాయం అందించారు మంత్రి కేటీఆర్. వివరాల్లోకి వెళితే… పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన ఆవునూరి అఖిల తండ్రి ప్రభాకర్ ఒక రైతు. అఖిల్ ఇంటర్మీడియట్ సుమారు 98 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఎంబిబిఎస్ సీట్లు సాధించింది.

మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో సీటు దక్కించుకున్న అఖిల కు ఫీజులు చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురైన విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. ఆమె విద్యాభ్యాసానికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఈ మేరకు నిన్న ప్రగతి భవన్ లో అఖిల కుటుంబ సభ్యులను కలిసి ఆర్థిక సహాయం చేశారు. అటు భద్రాద్రి కొత్తగూడెం కు చెందిన.. స్పందనని విద్యార్థులు కూడా ఎంబీబీఎస్ సీటు కోసం ఆర్థిక సహాయం చేశారు మంత్రి కేటీఆర్. ఇక ఈ ఆర్థిక సహాయంపై ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు ఫుల్ ఖుషి అవుతున్నాడు. మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version