సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఓ రైలులో అగ్ని ప్రమాదం

-

Fire accident in a train Secunderabad railway station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఓ రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ రైల్ నిలయం పక్కనున్న రైల్వే బ్రిడ్జి మీద ఆగిన ఓ రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ తరుణంలోనే… సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద తగలబడుతున్నాయి రెండు బోగీలు. రెండు బోగీల నుంచి భారీగా ఎగిసిపడుతున్నాయి పొగలు. అటు నిలిచి ఉన్న బోగీల నుంచి ఒకసారిగా మంటలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.

Fire accident in a train ,Secunderabad railway station

వాషింగ్ కి వెళ్లి ప్లాట్ ఫాం మీదకి వస్తున్న అదనపు ఏసి బోగిలో షాట్ సర్క్యూట్ అయినట్లు చెబుతున్నారు. అయితే.. మంటలు ఎగిసిపడగానే… వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది మంటలు, పొగలను ఆర్పేస్తున్నారు. అయితే.. ఈ ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక ఈ సంఘటన పై రైల్వే అధికారులు అలర్ట్‌ అయి… దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రైలులో అగ్ని ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version