హైదరాబాద్ లో విషాదం..కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి

-

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి 17 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఐదు నెలల పసికందు చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. షేక్ పేట వినోబానగర్ లో ఉంటున్న అనూష, అంజి దంపతులు కూలీలు. ఈ నెల 8న తమ గారాల పట్టి శరత్ ను గుడిసెలో పడుకోబెట్టి పనులకోసం బయటకు వెళ్లారు.

Five-year-old boy died in dog attack

కాసేపటికి వచ్చి చూసేసరికి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి ఏడుస్తూ కనిపించాడు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి నీలోఫర్ కు, అక్కడి సిబ్బంది సూచనలతో ఉస్మానియాకు తరలించారు. అక్కడి వైద్యులు చిన్నారికి శస్త్రచికిత్స చేసి ఎన్ఎస్ఐసీయూలో ఉంచారు. ఇన్నాళ్లు మృత్యువుతో పోరాడిన ఆ చిన్నారి ఓడిపోయాడు. మూడు వీధి కుక్కలు గుడిసెలోకి చేరి దాడి చేసినట్లు స్థానికులు సీసీ కెమెరాల్లో గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news