సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మాజీ డీఎస్పీ నళిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేశారు నళిని. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన నళినికి పోలీస్ శాఖతో తిరిగి అదే ఉద్యోగాన్ని ఇచ్చే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులతో చర్చించారు.

ఆమెకు ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే.. తిరిగి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. పోలీస్ మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలు పోలీస్ మార్గదర్శకాలను సంబంధించి అవరోధాలు ఉంటే అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. అవసరం అయితే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సచివాలయంలో రేవంత్ రెడ్డిని.. నళిని కలిసి మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version